*ఇంటర్ విద్యార్థులకు పరీక్ష ఫీజు గడువు పెంపు*
ఇంటర్ విద్యార్థులకు పరీక్ష ఫీజు గడువును పెంచుతూ బోర్డు నిర్ణయించింది. ఇంకా మిగిలిపోయిన ప్రభుత్వ, ప్రైవేటుకు చెందిన ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు తత్కాల్ కింద ఫీజు చెల్లించవచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి పి. రంజిత్ బాషా తెలిపారు. ఈనెల 22 నుంచి వచ్చే ఏడాది జనవరి 5లోగా అపరాధరుసుంతో తత్కాల్ కింద రూ. 5000 చెల్లించి పరీక్షకు హాజరుకావచ్చని కార్యదర్శి వివరించారు.