🥁
రిటైర్మెంట్కు రెండేళ్ల ముందే సర్వీస్ ధ్రువీకరణ*
*నిధి పోర్టల్లో కామన్ అప్లికేషన్ ఫాం
*ఉత్తర్వులు జారీచేసిన ఆర్థికశాఖ*
ఉద్యోగులు పదవీ విరమణ ప్రయోజనం పొందేందుకు దరఖాస్తులు, సంబంధిత ఫాంలలో మార్పులు చేస్తూ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం పదవీ విరమణ సమయంలో మాత్రమే సర్వీస్ వివరాలు తనిఖీ చేస్తుండటం వల్ల పెన్షన్ దరఖాస్తుల ప్రాసెసింగ్లో జరుగుతున్న తీవ్ర జాప్యాన్ని నివా రించేందుకు ప్రీ రిటైర్మెంట్ సర్వీస్ వెరిఫికేషన్ చేపట్టినట్లు తెలిపారు. పదవీ విరమణ తేదీకి రెండేళ్ల ముందు సర్వీస్ వివరాల ధ్రువీకరణను తప్పనిసరి చేశారు. ఇది పదవీ విరమణ సమయంలో చివరి రెండేళ్ల సర్వీస్ వివరాల ధ్రువీ కరణను సులభతరం చేస్తుందని, ప్రక్రియ జాప్యాన్ని తొలగిస్తుందని పేర్కొ న్నారు. ఆర్థికశాఖ నిధి పోర్టల్ ద్వారా పదవీ విరమణ ప్రయోజనాలను ఆన్ లైన్లో అందించే ప్రక్రియను క్రమబద్ధీకరించడంతో పాటు డిజిటలైజ్ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ పోర్టల్లోని కామన్ అప్లికేషన్ ఫాం ద్వారా దరఖాస్తుల్ని ప్రాసెస్ చేయనున్నట్లు తెలిపారు. సర్వీస్ రిజిస్టర్కి సంబంధించినవి తప్ప దేనికీ మాన్యువల్ ప్రక్రియలు, భౌతికపత్రాలు ఉండవని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
📍