• Home/
  • /
  • SATMPT 2 పరీక్ష రాసేందుకు విద్యార్థులకు ఇవ్వవలసిన సూచనలు

SATMPT 2 పరీక్ష రాసేందుకు విద్యార్థులకు ఇవ్వవలసిన సూచనలు

 SATMPT 2 పరీక్ష రాసేందుకు విద్యార్థులకు ఇవ్వవలసిన సూచనలు

 
 
6-8 తరగతులకు SATMPT - 2 (పాత పద్ధతిలో SA 2) CBA పద్ధతిలో జరుగును. ఆ ప్రశ్నాపత్రం నందు
 
 20 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలుంటాయి. వీటికి 20 x 2=40 మార్కులు.
 
తరువాత 6 ప్రశ్నలు లఘు సమాధాన ప్రశ్నలు (short answer questions) ఇస్తారు. ఒక్కొక్క ప్రశ్నకు 4 మార్కుల చొప్పున 24 మార్కులు.
 
తరువాత రెండు వ్యాస రూప ప్రశ్నలు(Essay type questions) ఇస్తారు. ఒక్కొక్క ప్రశ్నకు 8 మార్కుల చొప్పున 16 మార్కులు.
 
మొత్తం 40+24+16= 80 మార్కులు.
 
విద్యార్థులు ఇచ్చిన తెల్ల కాగితం పై మొదటి 20 ప్రశ్నలు వరుసగా 20 సంఖ్యలు వేసుకుని వాటి ఎదురుగా సరి అయిన సమాధానం A/B/C/D ఏదైతే అది రాయమనాలి.
 
ఉదా. 1వ ప్రశ్నకు A సమాధానం అయితే
1 - A గా రాయాలి. అలాగే మిగిలినవి
2-
3-
4-
 
అలా అంకెలు వేసి సమాధానాలు రాయమనాలి. (ఇలా తెల్ల కాగితం పై రాయించడం వలన మూల్యాంకనం సులభంగా ఉంటుంది)
 
మిగిలిన లఘు వ్యాస రూప ప్రశ్నలకు తరువాత సమాధానం రాయమనాలి.
 
ప్రశ్నలు అన్నీ అనువర్తిత (అప్లికేషన్) పద్ధతిలో ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత గా చదివి అర్థం చేసుకుని రాయాలి.
 
Textbook ను జాగ్రత్తగా చదవాలి. లేకపోతే ఇటువంటి ప్రశ్నలకు సమాధానం రాయలేరు.