B.Ed కోర్సులకు ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం..
ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈడీ & బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) కోర్సుల్లో ప్రవేశానికి AP EdCET 2025 నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ ప్రవేశ పరీక్షను ఈసారి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీలు: బీఈడీ, బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) కోర్సుల్లో ప్రవేశాల కోసం
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీలో కనీసం 50% మార్కులు (SC/ST/BC అభ్యర్థులకు సడలింపు ఉంటుంది)
చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా అర్హులే
పరీక్ష విధానం: ఆన్లైన్ మోడ్లో, ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు – మొత్తం 150 మార్కులు
ఎంపిక విధానం: EdCET ఆన్లైన్ పరీక్ష ఆధారంగా
దరఖాస్తు విధానం: అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి
దరఖాస్తు చివరి తేదీ: 14.05.2025
పరీక్ష తేదీ: 05.06.2025